ఉదయ్ నిధి తల నరికితే రూ.10 కోట్లు : పరమహంస ఆచార్య సంచలన ప్రకటన

ఉదయ్ నిధి తల నరికితే రూ.10 కోట్లు : పరమహంస ఆచార్య సంచలన ప్రకటన

సనాతన ధర్మం నశించాలి.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉదయ్ నిధి స్టాలిన్ పై హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే మాటలతో కాకుండా వార్నింగ్స్ వరకు వెళ్లింది ఇష్యూ. 2023, సెప్టెంబర్ 4వ తేదీన.. అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చిన వారికి 10 కోట్ల రూపాయల డబ్బు ఇస్తానని ప్రకటించారు. అంతేనా.. స్టాలిన్ ఫొటోను కత్తితో పొడుస్తూ కనిపించారు.

అయోధ్య:సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అయోధ్య సాధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సాధువు పరమహంస ఆచార్య ఆ నాయకుడి తల నరికితే 10 కోట్ల రూపాయలు బహుమతి ప్రకటించారు. ఉదయ నిధి స్టాలిన్ ఫొటోను కత్తితో పొడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

సనాతన ధర్మానికి లక్షల సంవత్సరాల నుంచి మూలాలు ఉన్నాయని.. మిలియన్ సంవత్సరాలనుంచి ఉనికిలో ఉందని.. 2 వేల సంవత్సరాల క్రితం నుంచి కొన్ని మతాలు ఉనికిలోకి వచ్చాయని సాధువు పరమహంస అన్నారు. భూమిపై ఒకే మతం ఉండేది.. అది సనాతన ధర్మం.. ఆది, అంతంలేనింది సనాతన ధర్మం అని అన్నారు. సనాతన ధర్మం ఎప్పటికీ నాశనం కాలేదని, ఎప్పటికీ నాశనం కాదన్నారు. సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే నాశనం చేస్తామని పరమహంస హెచ్చరించారు.