
ఉజ్జయిని బాలిక అత్యాచారం కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యి.. తీవ్ర గాయాలతో.. రక్త స్రావంతో ఎనిమిది కిలోమీటర్లు.. రెండున్నర గంటలు నడిచిన ఘటన అందర్నీ కలిచి వేస్తుంది. ఈ విషయంలో జాతీయ మీడియా గ్రౌండ్ రిపోర్టులో మనసును కలిదించే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అత్యాచారంతో.. తీవ్రంగా గాయపడిన బాలికను రక్షించేందుకు ఉజ్జయిని జనం ముందుకు రాకపోవటం అనేది మానవత్వానికే మాయని మచ్చగా మారింది. కనీసం ఎవరూ దుస్తులు ఇచ్చేందుకు కూడా ముందుకు రాకపోవటం.. ఆ బాలిక ఎంతో మంది ఇళ్ల తలుపులు కొడుతూ.. సాయం కోరినా.. ఎవరూ కూడా కనికరించకపోవటం అనేది సమాజంలోని మనుషుల వ్యక్తిత్వాలను వేలిత్తి చూపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ బాలికకు కావాల్సింది దుస్తులు, వైద్య సాయం.. అయితే కొంత మంది చేతిలో 50, 100 రూపాయలు పెట్టి.. వెళ్లిపో వెళ్లిపో అనటం.. మరో దారుణమైన ఘటన.
ఓ ఆశ్రమంలోని పూజారి.. టవల్, దుప్పటి ఇచ్చేంత వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చేవరకు ఎవరూ ఆ బాలిక దగ్గరకు కూడా రాలేదు. ఇదే విషయాన్ని ఉజ్జయిని ఎస్పీ సచిన్ శర్మ దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. ఎవరి ఆలోచన వాళ్లది.. ఎవరి భయం వాళ్లది.. ఎవరి పరిధులు వాళ్లకు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు.
ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలిక అర్థ నగ్నంగా వీధుల్లో సాయం కోసం.. ఇళ్ల దగ్గరకు వెళితే అయ్యో పాపం.. అని కనికరించిన వాళ్లు లేకపోవటం ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తుంది.