
హైదరాబాద్, వెలుగు: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీన పథకంలో పేర్కొన్నట్టుగా బ్యాంక్ ‘ఫుల్లీ పెయిడ్ఈక్విటీ షేర్ల’ను జారీ చేయడానికి, కేటాయించడానికి 03 మే 2024 తేదీని రికార్డు డేట్గా నిర్ణయించింది.
ఇదిలా ఉంటే, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడు సంవత్సరాల కాలానికి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కరోల్ ఫుర్టాడోను నియమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నియామకాన్ని ఆమోదించింది. బ్యాంక్ 8వ ఏజీఎంలో కరోల్ ఫుర్టాడో, బ్యాంక్ తమ వాటాదారుల ఆమోదాన్ని కోరుతారు