కీవ్: రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని భూమిపై నుంచి తుడిచిపెట్టేందుకు రష్యా ప్రయత్నిస్తున్నదని, అందులో భాగంగా మిసైల్స్తో దాడులు చేస్తున్నదని విమర్శించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సోమవారం జరిపిన దాడుల్లో అమాయక ప్రజలు చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని అన్నారు.
కీవ్తో పాటు ఉక్రెయిన్పై మొత్తం 75 మిసైల్స్తో దాడి చేశారన్నారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ర్టక్చర్, అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు తెగబడుతున్నదన్నారు. వీటి కోసం ఇరాన్ డ్రోన్లను ఉపయోగిస్తోందన్నారు. ఉక్రెయిన్వ్యాప్తంగా రష్యా వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉందని, ప్రజలందరూ షెల్టర్లలోనే ఉండాలని జెలెన్స్కీ సూచించారు. గాయపడినవారు కూడా బయటికి రావొద్దన్నారు.