పంటనష్టం: పోలంలోనే అన్నదాత ఆత్మహత్య

పంటనష్టం: పోలంలోనే అన్నదాత ఆత్మహత్య

నిర్మల్ జిల్లా: అప్పుల బాధ భరించలేక అన్నదాత పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నిర్మల్ జిల్లాలో జరిగింది. మామడ మండలం, తాండ్ర గ్రామానికి చెందిన నాయిడి భీమన్న (40) అప్పులు చేసి పంటసాగు చేశాడు. భారీ వర్షాలకు పంటనష్టపోవడంతో దిగులు చెందాడని.. పంటల సాగుకు చేసిన అప్పులు భారమై, పంట దిగుబడి రాదేమోనన్న బెంగతో పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.