ములుగు/ మల్హర్/ హసన్ పర్తి/ నెక్కొండ/ నల్లబెల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా ఒక్కటవుతున్నారు. అంతా కలిసి నిర్ణయం తీసుకుని అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకుంటామంటూ ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి.
రెండో విడత ఎన్నికల్లో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి మండలం ముద్దునూరుతండా, గుర్తూర్ తండా, కొడిశెలకుంట, దేవనగర్జీపీలు, ములుగు మండలంలో జగ్గన్నపేటలో అర్రెం వెంకన్న, అంకన్నగూడెం కొట్టెం రాజు, రాయినిగడెంఈసం సునీత, కొత్తూరు గట్టి సుదర్శన్, బంజరుపల్లి కంచం రఘు, పెగడపల్లి గొల్ల కుమార్ ఏకగ్రీవమయ్యారు.
వెంకటాపూర్ మండలంలో అడవి రంగాపూర్, కేశవాపూర్, తిమ్మాపూర్, పాపయ్యపల్లి, నర్సింగాపూర్ జీపీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని దుబ్బపేట (తండా), వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో చిన్నకోర్పోల్, టీకే తండా, వెంకట్తండా, దేవునితండాఏకగ్రీవం కాగా, దుగ్గొండి మండలం నారాయణతండాలో నామినేషన్ వేసిన వ్యక్తులు విత్డ్రా చేసుకోగా, ఒకే వ్యక్తి బరిలో ఉండడంతో ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఆర్వపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
