అల్లుడిని కొట్టి చంపిన పిల్లనిచ్చిన మామ

అల్లుడిని కొట్టి చంపిన పిల్లనిచ్చిన మామ

వరంగల్ జిల్లా రంగశాయిపేటలో దారుణం. అల్లుడిని కొట్టి చంపాడు పిల్లనిచ్చిన మామ. అల్లుడు శ్రీనివాస్ ఆవారాగా తిరుగుతూ ఉన్నాడు. కొట్లాటలు, బెదిరింపులతో అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. కొన్నేళ్లుగా భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ విషయంలో మామతో విబేధాలు వచ్చాయి. కూతురి కాపురం విషయంలో చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మామ. అయినా అల్లుడు శ్రీనివాస్ విషయంలో ఎలాంటి మార్పు రాకపోగా.. ఏకంగా అత్తమామలకు నరకం చూపిస్తున్నాడు.

2024, ఫిబ్రవరి 13వ తేదీ ఇంటికి వచ్చిన అల్లుడు, రౌడీషీటర్ అయిన శ్రీనివాస్ భార్యతోపాటు అత్తమామలతో గొడవలకు దిగాడు. కొన్నేళ్లుగా భరిస్తూ వస్తున్న మామ.. సహనం కోల్పోయి.. అల్లుడిపై దాడి చేశాడు. కర్ర, రాడ్డుతో అల్లుడిని కొట్టాడు. ఈ దాడిలో అల్లుడు శ్రీనివాస్ చనిపోయాడు. విషయం తెలిసి పోలీసులు కేసు నమోదు చేశారు. మామను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు. వేధింపులు తట్టులోలేక గొడవ పడ్డాం అని.. ఈ గొడవలో చనిపోయినట్లు చెబుతున్నాడు మామ. 

శ్రీనివాస్ పై మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే రౌడీషీట్ ఉంది. 

Also Read: గవర్నర్ కాన్వాయ్ ను ఢీకొన్న కారు..