యూజీడీపై నివేదికను సిద్ధం చేయాలి

యూజీడీపై నివేదికను సిద్ధం చేయాలి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: గ్రేటర్​వరంగల్​సిటీలో అండర్​గ్రౌండ్​డ్రైనేజీ(యూజీడీ)పై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాలని  బల్దియా మేయర్​ గుండు సుధారాణి అన్నారు.  మంగళవారం బల్దియా హెడ్ ఆఫీస్​లో బల్దియా మేయర్​ సుధారాణి, బల్దియా కమిషనర్​అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఇంజనీరింగ్​ఆఫీసర్లతో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ ప్రాజెక్టు పై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్​మాట్లాడుతూ..  యూజీడీ రూపకల్పనపై జోన్ల వారీగా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్​ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్​బాబు, మాధవిలత తదితరులు ఉన్నారు.