న్యూఢిల్లీ: విదేశీ అప్పులు అనుమతించదగ్గ స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎక్స్టర్నల్ డెట్ సర్వీస్ రేషియో 5.3 శాతం ఉందన్నారు. మొత్తం అప్పు 624.7 బిలియన్ డాలర్లకు చేరాయని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన 'ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్: ఎ స్టేటస్ రిపోర్ట్ 2022–-23'కి ఆమె ముందుమాట రాశారు.
జీడీపీకి విదేశీ అప్పుల నిష్పత్తి మార్చి- చివరి నాటికి 20 శాతం నుంచి 18.9 శాతానికి తగ్గింది. దీర్ఘకాలిక అప్పు మొత్తం విదేశీ అప్పులో 79.4 శాతంగా ఉంది. అయితే మొత్తం విదేశీ అప్పుల్లో 20.6 శాతం స్వల్పకాలిక అప్పు దిగుమతులకు ఆర్థిక సహాయం చేస్తుంది. 2022–-23లో డెట్సర్వీస్ నిష్పత్తి అంతకుముందు సంవత్సరంలో 5.2 శాతం నుంచి 5.3 శాతానికి స్వల్పంగా పెరిగింది. డెట్ సర్వీస్ చెల్లింపులు 2021-–22లో 41.6 బిలియన్ డాలర్ల నుంచి 2022–23 నాటికి 49.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి.