నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఎర్దండిలో జరిగిన దాడిపై అమిత్ షా ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షాకు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలను ఇచ్చిందని అర్వింద్ ఆరోపించారు. దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఉన్నారని అన్నారు.
అర్వింద్ కారును ధ్వంసం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు
జగిత్యాల జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.