దీపావళికి స్వీట్లు, బొమ్మలు కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దీపావళికి స్వీట్లు, బొమ్మలు కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రజా సమస్యలు, రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా షాపింగ్ చేశారు. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ కు వెళ్లిన కేంద్రమంత్రి.. మార్కెట్ లో కలియతిరిగారు. అనంతరం స్వీట్లు, బొమ్మలు, పెనీలు కొనుగోలు చేశారు. పేటీఎం ద్వారా డబ్బు చెల్లించారు. వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయని కొంతమంది షాపు యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు కిషన్ రెడ్డికి తమ సమస్యల గురించి వివరించారు.

దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరిలో జీవితాల్లో వెలుగులు నింపే పండగని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో దీపావళి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్రమోడీ, తన తరఫున దేశ ప్రజలకు కిషన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.