గోవా ఎన్నికల సహ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి

గోవా ఎన్నికల సహ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవా రాష్ట్రానికి ఎన్నికల సహ ఇంచార్జ్ గా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని భారతీయ జనతాపార్టీ నియమించింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్  గోవా ఎన్నికల ఇంచార్జ్ గా.. ఆయనకు తోడుగా సహ ఇంచార్జ్ లుగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి దర్శనా జర్దోశ్ లను నియమిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గోవా రాష్ట్రం దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం. గోవా రాష్ట్రంలో స్థానిక సమస్యలను పరిష్కరించి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా స్థానిక ప్రజల్లో విశ్వానం కల్పించేందుకు కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.