కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుడి కాలికి ఫ్రాక్చర్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుడి కాలికి  ఫ్రాక్చర్

కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి కుడికాలి మడమ వద్ద బోన్  ఫ్రాక్చర్ అయ్యింది. గతంలో ఆయన కుడికాలు మడమకు దెబ్బ తగిలింది. ఇటీవల లెగ్ పెయిన్ ఎక్కువగా రావడంతో చికిత్స కోసం నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG హాస్పటల్ కు వెళ్లారు. అక్కడ ఎక్సరే తీయగా అందులో కుడికాలి మడమ వద్ద  ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన కాలికి పట్టీకట్టారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే లెగ్ పెయిన్ తగ్గుతుందని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ గత కొద్ది రోజుల నుంచి కాలి మడమ వద్ద నొప్పి తీవ్రతరం కావడంతో పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్ కు వచ్చారు.