హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని.. బస్తీల అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని రాష్ట్రప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్, రాంగోపాలపేట డివిజన్లలో పర్యటించి బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

బస్తీల్లో చాలా సమస్యలు అలాగే ఉన్నాయని.. కలుషిత నీటితో పాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో నిధులు లేవన్న కారణంతో బస్తీలను అభివృద్ది చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ను తలపించేలా తీర్చుదిద్దుతున్నట్లు తెలిపారు.