హైదరాబాద్: హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ను స్థాపించడానికి సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ను స్థాపించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వస్తుందని, అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికి ఎంతో మేలు జరుగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ ఏర్పాటుకు భూమి కావాల్సి ఉండగా.. భూమి గుర్తింపు విషయంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయన్నారు. సీఎం కేసీఆర్ భూమికి సంబంధిచి పెండిగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.
Therefore, addressed a letter to @TelanganaCMO requesting to resolve the pending issues related to its setting up at the earliest. pic.twitter.com/cIbBkqACkS
— G Kishan Reddy (@kishanreddybjp) February 18, 2022