సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్:​ హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను స్థాపించడానికి  సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తెలంగాణ సీఎం  కేసీఆర్​కు లేఖ రాశారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను స్థాపించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల హైదరాబాద్​ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వస్తుందని, అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికి ఎంతో మేలు జరుగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ ఏర్పాటుకు భూమి కావాల్సి ఉండగా.. భూమి గుర్తింపు విషయంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయన్నారు. సీఎం కేసీఆర్​ భూమికి సంబంధిచి పెండిగ్​ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.

మరికొన్ని వార్తల కోసం

ఎంప్లాయ్‎కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్

మౌనమే ప్రేమ భాష.. మాటలు రాకున్నా ఇన్స్టా ఒక్కటి చేసింది