మహారాష్ట్రలో త్వరలోనే మార్పు చూడబోతున్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు. ఈ మార్పు మార్చి కల్లా చూస్తారని, ఉన్న గవర్నమెంట్ కూలడమో, కొత్త గవర్నమెంట్ ఏర్పడడమో ఏదో ఒకటి జరగబోతోందని ఆయన చెప్పారు. జైపూర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీ సర్కారు ఏర్పడే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు. కొన్ని విషయాలను సీక్రెట్గానే ఉంచాలని రాణే అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఆరోగ్యం బాగోలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఇప్పుడు ఆ విషయం మాట్లాడొద్దని చెప్పారని అన్నారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి ఉద్ధవ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ సర్కారు ఎక్కువ కాలం అధికారంలో ఉండబోదని రాణే చెప్పారు.
#WATCH | "Change will be seen in Maharashtra very soon. The change will be seen by March. To form a government, to break a govt, some things have to be kept secret," Union Minister Narayan Rane in Jaipur (25.11) pic.twitter.com/GAlDtDr1xO
— ANI (@ANI) November 26, 2021
కాగా, రెండు వారాల క్రితం శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్లో వెన్నెముక సర్జరీ జరిగింది. ఈ సమయంలో మాజీ శివసేన నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే.. మహా సర్కారు త్వరలో కూలిపోనుందని, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది.