- కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఇవాళ ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో కలిసి పోలవరం ప్రాజెక్టును హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనతంరం పోలవరం పునరావాస గ్రామాల్లో పర్యటించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు కేంద్ర మంత్రి షెకావత్. పునరావాస కాలనీల్లో వసతులు బాగున్నాయని కేంద్రమంత్రి షెకావత్ ప్రశంసించారు. పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధపెట్టాలని సూచించారు. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, పునరావాస కాలనీల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. తర్వాత ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఇరువురు కలసి పరిశీలించారు.
ఇవి కూడా చదవండి