- కేసీఆర్ హామీలు నెరవేరుతలేవు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి
హుజూరాబాద్టౌన్, వెలుగు: సకలజనుల సమ్మె సైరన్ఊది సబ్బండ వర్గాలను ఏకం చేసింది ఉద్యోగులు, టీచర్లేనని.. స్వరాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతయని అనుకున్నామని, నాడు పోరాటాలకు సహకరించిన తామే నేడు ఆగమౌతున్నామని మాజీ ఎమ్మెల్సీ, రిటైర్డ్ టీచర్ ఎంప్లాయీస్ బీజేపీ సెల్ చైర్మన్ మోహన్రెడ్డి అన్నారు. హుజూరాబాద్లోని మధువని గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈటల రాజేందర్గెలిస్తే ఏం చేస్తాడని కొందరు విమర్శిస్తున్నారని.. ఆయన గెలిస్తే రాష్ట్రంలో అనేక మార్పులు వస్తాయని చెప్పారు.
25 ఏండ్లు పీఆర్టీయూ నాయకుడిగా ఉన్నానని, తన కెరీర్లో 15 మంది సీఎంలను చూశానని.. కానీ ఇప్పటివరకు ఎవరూ చేయనంత మోసం కేసీఆర్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కారణంగా పాలన కుంటుపడిందని, విద్యావవస్థ భ్రష్టుపట్టిందని, ఎంఈవో, టీచర్ఖాళీలు భర్తీ చేయలేని దుస్థితి దాపురించిందన్నారు. సమస్యలు పరిష్కరిస్తానంటూ చర్చలకు పిలిచి ఆరేండ్లు గడిచాయని, నేటికీ పరిస్థితి ఏ మాత్రం మారలేదన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని కోరితే 1వ తేదీన ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతం వచ్చేదని, ఇప్పుడు ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తదో అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగ బంధు, టీచర్బంధు కూడా ప్రవేశపెట్టాలని, ఒకేసారి అకౌంట్లో రూ. 10 లక్షల వేసి అందులోంచి నెలనెలా వేతనాలు తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని సూచించారు.
ప్రజలు, ఉద్యోగులు, టీచర్లు అంతా కలిసి ఈటలను గెలిపిస్తే రాష్ట్రంలో మార్పు వస్తుందని మోహన్రెడ్డి చెప్పారు. ఈటల రాజేందర్ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో సేవలందాయని, ప్రస్తుతం హరీశ్రావు హయాంలో ఆ సేవలు అందడం లేదని బీజేపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సెల్రాష్ట్ర కో చైర్మెన్ వెంకటరెడ్డి ఆరోపించారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, రిటైర్డ్ఎంప్లాయీస్లీడర్లు విజయలక్ష్మి, రత్నాకర్, గట్ల నర్సిరెడ్డి, వీరస్వామి, మనోహర్కుమార్, నరోత్తంరెడ్డి, రాజన్న, వెంకటరెడ్డి, నరేందర్, మంజులారెడ్డి పాల్గొన్నారు.