స్వాతంత్ర్య దినోత్సవం 2023 : 76 లేక 77వ వేడుకలా.. ఎందుకీ డౌట్స్ అంటే..

స్వాతంత్ర్య దినోత్సవం 2023 : 76 లేక 77వ వేడుకలా.. ఎందుకీ డౌట్స్ అంటే..

పంద్రాగస్టు.. భారత దేశం పరాయి పాలననుంచి స్వాతంత్ర్యం పొందిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు.. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ మహత్తర సందర్భం శతాబ్దాల పోరాటం, త్యాగం, అచంచలమైన సంకల్పానికి ముగింపు పలికింది. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయుల అలుపెరగని పోరాటం, ప్రాణత్యాగం ఫలితంగా స్వాతంత్రం సిద్దించిన రోజును మనం పండుగలా జరుపుకుంటున్నాం. అయితే  ఈ ఏడాది జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 76వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 77వ స్వాతంత్ర్య దినోత్సవమా అనే చర్చ ప్రస్తుతం  సాగుతోంది. 

76వ స్వాతంత్య్ర దినోత్సవం: బ్రిటీష్ పాలన నుంచి దేశం స్వాతంత్ర్యం పొందిన ఒక సంవత్సరం తర్వాత భారతదేశం మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని 1948 ఆగస్టు 15న జరుపుకున్న వాస్తవం ఆధారంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించబడుతుంది. ఇది చాలా సాధారణమైన గణన పద్ధతి. 
77వ స్వాతంత్య్ర దినోత్సవం:  భారతదేశం 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం లభించిందనే వాస్తవం ఆధారంగా  ఈ లెక్కింపు విధానం రూపిందించబడంది. కాబట్టి 2023 అనేది 77వ స్వాతంత్ర్య దినోత్సవం. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోని తీసుకుంటున్నారు. 
స్వాతంత్ర్య దినోత్సవం 2023 థీమ్
స్వాతంత్ర్య దినోత్సవం యొక్క థీమ్  నేషన్ ఫస్ట్.. ఆల్వేష్ ఫస్ట్.. ఈ థీమ్ కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకు మొదటి స్థానం ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
స్వాతంత్ర్య దినోత్సవం ఇది ఎలా జరుపుకుంటారు
పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఈ రోజు ప్రారంభమవుతుంది.. ఆ తర్వాత దేశభక్తి గీతాలు పాడటం, సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయ భావం నింపుతాయి. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగింస్తారు. దేశం సాధించిన విజయాలను ప్రతిబింబిస్తూ.. నిరంతర ప్రగతి ఆవశ్యకతను నొక్కి తెలియజేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం అనేది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు.. దేశం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం.. ఇది భారత దేశానికి ఆధారమైన భిన్నత్వంలో ఏకత్వం,  ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది.
 
రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, కవాతులు జరుగుతాయి.  ప్రజలంతా జెండా పండుగలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తారు. దేశం పట్ల తమకున్న ప్రేమను చాటుకుంటారు. అంతేకాదు.. దేశ ప్రగతి, ముందున్న సవాళ్లను ప్రజలు అంచనా వేసేందుకు ఈ రోజు ఒక సమయంగా ఉపయోగపడుతుంది. రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు స్వాతంత్ర్య దినోత్సవం ఓ మంచిరోజు.