దేశంలో ఇదే ఫస్ట్.. ఎలుకను చంపాడని ఛార్జిషీట్.. అది అంత తప్పా..

దేశంలో ఇదే ఫస్ట్.. ఎలుకను చంపాడని ఛార్జిషీట్.. అది అంత తప్పా..

ఎలుక.. కనిపిస్తే కొట్టి చంపుతాం.. దొరక్కపోతే బోను పెట్టి పట్టుకుంటాం.. మందు పెట్టి చంపుతాం.. అందరూ చేసేదే ఇది. ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదు.. ఇది మాత్రం భిన్నం. ఎలుకను క్రూరంగా చంపాడని అతనిపై కేసు నమోదైంది.. విచారణ తర్వాత ఛార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేశారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ కేసు.. బహుశా దేశంలోనే ఫస్ట్ టైం అంటున్నారు లాయర్లు. పూర్తి వివరాల్లోకి వెళితే.

2022 నవంబర్‌లో ఎలుకను ఇటుకతో కట్టి కాలువలో ముంచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుదౌన్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తిపై యూపీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇలాంటి కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం బహుశా యూపీలో ఇదే మొదటిసారి అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు మనోజ్ కుమార్ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసించే కుమ్మరి. గత సంవత్సరం IPC సెక్షన్ 429 (పశువులను చంపడం లేదా వికలాంగులను చేయడం) కింద జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11 (1) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 స్థానిక జంతు హక్కుల కార్యకర్త వికేంద్ర శర్మ అనే వ్యక్తి మనోజ్ కుమార్ పై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఎలుకను రాయితో కట్టి చనిపోయేలా చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టు కుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది.

 ఎలుక  శవపరీక్ష తరువాత మరణానికి కారణం "డ్రై డ్రౌనింగ్" అని నిర్ధారించబడింది. శవపరీక్ష నివేదిక, వీడియో ఆధారాలు, స్థానికుల వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు అధికారి కుమార్‌పై చార్జిషీట్‌ దాఖలు చేశారని, సర్కిల్‌ అధికారి ధ్రువీకరణ అనంతరం కోర్టు ముందు సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. అయితే "ఎలుకలు చాలా మందికి ఎలుకలు మాత్రమే కావచ్చు, కానీ దానిని చంపిన విధానం జంతువులపై క్రూరత్వం కింద వస్తుంది. అందుకే, నేను ఈ కేసు ఫైల్ చేశా"నని ఫిర్యాదుదారు తెలిపారు. "భవిష్యత్తులో మరే ఇతర జంతువుతోనూ ఇలా చేయడానికి ఎవరూ ప్రయత్నించకుండా చూసుకోండి" అని చెప్పారు. శవపరీక్ష కోసం ఎలుక మృతదేహాన్ని IVRI- బరేలీకి పంపారని, దానిని కారులో ల్యాబ్ కాంప్లెక్స్‌కు తరలించడానికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించినట్టు స్పష్టం చేశారు.

మరోవైపు నిందితుడు తాను ఎలుకను చంపానని, వీడియో చిత్రీకరించిన సమయంలోనే తాను దానిని కాలువలో నుంచి బయటకు తీశానని పేర్కొన్నాడు. ఈ కేసులో దాఖలైన ఛార్జిషీటును సర్కిల్ అధికారి.. దర్యాప్తు అధికారికి సమర్పించారు. తనకు తెలిసినంతవరకు ఇది బహుశా యూపీలోనే నమోదైన మొదటి కేసని తెలిపారు.