మీరట్: హత్య కేసులో నిందితుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు 26 ఏండ్ల తర్వాత అరెస్ట్ చేశారు. నిందితుడు షానవాజ్ అలీ మరో 13 కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడని షహరాన్ పూర్ ఎస్పీ రాజేశ్ కుమార్ ఆదివారం మీడియాకు చెప్పారు. యూపీలోని షహరాన్పూర్ జిల్లాకు చెందిన షానవాజ్ 1991లో తన సహాయకుడైన అహ్మద్ అలీని చంపేశాడు. విచారణ తర్వాత కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. నాలుగేండ్లపాటు షానవాజ్ జైలు శిక్ష అనుభవించాడు. అదే ఏడాదిలో కండిషన్లతో కూడిన బెయిల్ మీద బయటికి వచ్చి కన్పించకుండా పోయాడని ఎస్పీ తెలిపారు. దీంతో నిందితుడిపై పోలీసులు నాన్బెయిలబుల్ వారెంట్ తో సహా పట్టించినవారికి రూ.25 వేల రివార్డు ప్రకటించారు. ‘‘షానవాజ్ కాశ్మీర్లో ఉంటున్నాడని సమాచారం అందింది. అక్కడ ఓ లోకల్ మార్కెట్లో సాక్సులు, స్కార్ఫ్లు అమ్ముకుంటూ బతుకుతున్నాడని తెలిసింది. స్పెషల్ టీమ్స్ ద్వారా షానవాజ్ను శుక్రవారం అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాం. జ్యుడీషిల్ కస్టడీకి తరలించాం”అని ఎస్పీ కుమార్ చెప్పారు.