
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా పర్యటలో ఉన్న రామ్ చరణ్ అక్కడి షోలో ఉపాసన డెలీవరీ గురించి ప్రస్తావించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ ను ఉపాసన డెలీవరికి అందుబాటులో ఉండాలని కోరాడు. దీనికి ఆస్టన్ ను కూడా ఉపాసన డెలివరీకి అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉపాసన డెలీవరీ అమెరికాలో జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రచారానికి ఉపాసన తన ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. తన డెలీవరి భారత్ లోనే జరుగుతుందని చెప్పారు
‘ డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ మీరు చాలా స్వీట్. మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్న. దయచేసి మీరు మా అపోలో హాస్పిటల్స్ కుటుంబంలో భాగం కండి. డాక్టర్లు సుమన మనోహార్, రుమా సిన్హాతో కలిసి నాకు డెలివరి చేయాలి ’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. ఇపుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.