మోర్ బేబీస్ ఆన్ ద వే..ఉపాసన ఇన్స్టా పోస్ట్ వైరల్

మోర్ బేబీస్ ఆన్ ద వే..ఉపాసన ఇన్స్టా పోస్ట్ వైరల్

ఉపాసన రామ్ చరణ్..మెగా కోడలుగా కుటుంబ బాధ్యతలను..అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరో రామ్ చరణ్ని పెళ్లాడి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన ఆమె..మంచి మర్యాదలతో, హెల్త్ పరమైన టిప్స్ ఇస్తూ..సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ పెంచుకుంది. 

అసలు విషయానికి వస్తే..లేటెస్ట్గా ఉపాసన (Upasana) చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘మై హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. మోర్ బేబీస్ ఆన్ ద వే’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ విభిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.అదేంటి మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా (Klin Kaara) వచ్చి కొన్ని నెలలే  అయింది కదా..అంతలోనే మరో బేబీనా? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

అయితే విషయం ఏంటంటే ఉపాసన మరోసారి తల్లి కావడం లేదు. ఆమె పెద్దమ్మగా ప్రమోట్ కాబోతుందని తెలిపింది. అంటే ఉపాసన చెల్లెలు అన్షుపాలకు మూడేళ్ల క్రితం పెళ్లి అవ్వగా..ఆమె ఇప్పుడు తల్లి కాబోతుందని పోస్ట్ లో వివరించింది. దీంతో ఉపాసన తన చెల్లి శ్రీమంతం ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేసి..ఈ హ్యాపీ న్యూస్ ను వెల్లడించింది. ఇక రీసెంట్గా ఉపాసన రామ్ చరణ్ తల్లి తండ్రులవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.