ఉప్పల్ భగాయత్ భూముల వేలంతో HMDA కు రూ.476 కోట్లు

ఉప్పల్ భగాయత్ భూముల వేలంతో HMDA కు రూ.476 కోట్లు

ఉప్పల్ భగాయత్ రెండో రోజు భూముల వేలం ద్వారా HMDA కు రూ. 333 కోట్ల ఆదాయం లభించింది. ఇవాళ (శుక్రవారం) జరిగిన వేలంలో గరిష్టంగా గజం రూ.72 వేలు పలకగా..కనిష్టంగా  రూ. 36 వేలు పలికినట్లు అధికారులు తెలిపారు. మొదటి రోజు (నిన్న) 19 వేల 719 గజాలు..రెండో రోజు 65 వేల 247 గజాలను వేలం వేసింది. నిన్న  రూ. 141 .61 కోట్ల ఆదాయం రాగా..ఇవాళ రూ. 333 కోట్ల ఆదాయం  వచ్చింది. మొత్తంగా రెండు రోజుల్లో  84,966 గజాల విస్తీర్ణ కలిగిన  39 ప్లాట్ల అమ్మకంతో HMDAకు రూ.476.61 కోట్ల ఆదాయం సమకూరింది.