లాక్ డౌన్ క్రమంలో ఇప్పటికే పలువురు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఏడాది పాటు తమ జీతంలో 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మైన్, సిబ్బంది. కరోనాపై దేశం చేస్తున్న పోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామన్నారు. లాక్ డౌన్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఏడాదిపాటు తమ జీతాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.
బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒక సంవత్సరం పాటు తమ బేసిక్ పే నుంచి 30 శాతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు వారి ఒక రోజు వేతనాన్ని పీఎం రిలీఫ్ ఫండ్, పీఎం కేర్స్ ఫండ్కు ఇస్తున్నట్టు చెప్పారు.