యూరియా కోసం రైతుల బారులు

యూరియా కోసం రైతుల బారులు

కామారెడ్డి, వెలుగు : దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లోని సొసైటీల వద్ద  శుక్రవారం యూరియా కోసం రైతులు బారులుదీరారు. దోమకొండ, బీబీపేట సొసైటీలకు గురువారం సాయంత్రం 400 బస్తాల చొప్పున యూరియా వచ్చింది.  దీంతో శుక్రవారం పొద్దునే రైతులు లైన్​లో నిలబడ్డారు. స్టాక్​ తక్కువగా ఉండటం రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.  

దోమకొండలో ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున,  బీబీపేటలో ఒక్కో రైతుకు బస్తా యూరియా పంపిణీ చేశారు. ఆయా మండలాల్లో యూరియా సమస్యపై కాంగ్రెస్​ లీడర్లు  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ దృష్టికి తీసుకెళ్లారు.   షబ్బీర్​అలీ వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావుతో ఫోన్లో మాట్లాడారు. కామారెడ్డి ఏరియాకు సరిపడా యూరియా సప్లయ్​ చేయాలని మంత్రిని కోరారు.