
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ను వీక్షించారు. మరుసటి రోజు, వేదిక వద్ద తన '24 క్యారెట్ల బంగారు ఐఫోన్'ను పోగొట్టుకున్నట్లు ఎక్స్ లో తెలిపింది. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులను ఆమె ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్తో పాటు, ఆమె అక్టోబర్ 15 నాటి పోలీసు ఫిర్యాదు పిక్ ను కూడా షేర్ చేసింది.
తాజా అప్ డేట్ ప్రకారం.. ఊర్వశి తన మెయిల్ స్క్రీన్షాట్ను షేర్ చేసింది. అందులో తన ఫోన్ ఆ వ్యక్తి వద్ద ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది.. అదేంటంటే, ఆ వ్యక్తి తన సోదరుడిని క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాయం చేయడానికి అంగీకరిస్తేనే ఆమె ఫోన్ను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం హైలెట్ గా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో స్క్రీన్షాట్ ను షేర్ చేసింది. స్క్రీన్షాట్తో పాటు, ఊర్వశి అక్టోబర్ 16 తేదీన ఈ మెయిల్కి థంబ్స్ అప్ సింబల్ కూడా ఇచ్చింది.
ALSO READ : అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత
అక్టోబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా, ఊర్వశి.. వీఐపీ కంపార్ట్మెంట్ నుంచి తనకు సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలను షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఈ వీడియోలలో ఒకదానిలో, ఆమె కారులో కూర్చుని తన చేతుల్లో 4-5 మ్యాచ్ టిక్కెట్లను ప్రదర్శిస్తుంది. ఇక ఆమె సినిమా విషయాలకొస్తే.. ఊర్వశి చివరిసారిగా సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ బ్రోలో స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో గ్రే అనే హిందీ చిత్రం, బ్లాక్ రోజ్ అనే తెలుగు మూవీ ఉన్నాయి. దీంతో పాటు ఆమె జాసన్ డెరు సినిమాలో ఓ పాటలోనూ కనిపించనుంది.