
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ కథానాయకుడిగా ‘ఊర్వసివో రాక్షసివో’ మూవీ నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని ‘మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను, కాసర్య శ్యామ్ రచించాడు. ఇటీవలే విడుదలైన టీజర్, సాంగ్కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని జీఏ–2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శిరీష్కు జోడీగా అను ఇమాన్యూయేల్ హీరోయిన్గా నటించింది. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.