రూ.9,640 కోట్లు కట్టండి ! బైజూ రవీంద్రన్కు అమెరికా కోర్టు ఆదేశం

రూ.9,640 కోట్లు కట్టండి ! బైజూ రవీంద్రన్కు అమెరికా కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: బైజూస్ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ కంపెనీకి 1.16 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.9,640.76 కోట్లు) బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అమెరికా కోర్టు ఎడ్​టెక్ ​కంపెనీ బైజూస్ ​ఫౌండర్​ బైజూ రవీంద్రన్‌‌‌‌ను ఆదేశించింది. ఆయన తమ ఆదేశాన్ని పాటించడంలో విఫలమయ్యారని, చాలాసార్లు దాటవేసే ధోరణి చూపించారని కోర్టు పేర్కొంది. బైజూస్​ ఆల్ఫా, గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌సీ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పు వచ్చింది.

రవీంద్రన్​ స్థాపించిన బైజూస్​ ఆల్ఫా.. లోన్​ నిబంధనలను ఉల్లంఘించిందని, మొత్తం బిలియన్ ​డాలర్ల లోన్​లో  533 మిలియన్​డాలర్లను అక్రమంగా యూఎస్ వెలుపలికి తరలించిందని గ్లాస్​ట్రస్ట్​  ఆరోపించింది. బైజూస్​ అల్ఫాను స్వాధీనం చేసుకోవడానికి కోర్టు గతంలోనే గ్లాస్​ట్రస్ట్​కు అనుమతి ఇచ్చింది. రవీంద్రన్ ఈ తీర్పుపై స్పందిస్తూ.. విచారణ సమయంలో తమ వాదనలను వినలేదని, ఈ డిఫాల్ట్ జడ్జిమెంట్​పై అపీల్ చేస్తామని ప్రకటించారు.