తైవాన్ కు మరోసారి అమెరికా తన మద్దతు తెలిపింది. చైనా దూకుడుతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న టైంలో.. తైవాన్ రక్షణ వ్యవస్థ బలోపేతానికి 1.1 బిలియన్ డాలర్ల ఆయుధాల ప్యాకేజీని ప్రకటించింది. శత్రుదేశాల క్షిపణుల ట్రాకింగ్ కోసం 665 మిలియన్ డాలర్ల విలువైన ముందస్తు రాడార్ హెచ్చరిక వ్యవస్థ, యుద్ధనౌకలను నీటముంచే సామర్థ్యం కలిగిన, 355 మిలియన్ డాలర్ల విలువైన 60 అధునాతన క్షిపణులతోపాటు 100 ఎయిర్ టు ఎయిర్ సైడ్ విండర్ క్షిపణుల విక్రయాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయని అమెరికాకు చెందిన రక్షణ భద్రత సహకార ఏజెన్సీ...DSCA తెలిపింది.
తైవాన్ పై డ్రాగన్ దాడులు చేసేందుకు యత్నిస్తుందనే....ఆ ద్వీప దేశానికి రక్షణ సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన సైనిక సాయం అందజేస్తున్నామని ....ఈ ప్యాకేజీ అత్యవసరమన్నారు అగ్రరాజ్య విదేశాంగశాఖ అధికార ప్రతినిధి. ఈ విక్రయాలు సాధారణ ప్రక్రియనే తెలుపుతూ.. బలగాల ఆధునికీకరణ, రక్షణ సామర్థ్యాల నిర్వహణ విషయంలో తైవాన్ ప్రయత్నాలకు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. చైనా సైనిక చర్యలను ఎదుర్కొనేందుకు ఆయుధాల కొనుగోలు సహాయ పడుతుందని.. తైవాన్ రక్షణశాఖ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది.