యుద్ధం ముగింపుపై ఆలోచిస్తున్నం.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

యుద్ధం ముగింపుపై ఆలోచిస్తున్నం.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్​పై ఇజ్రాయెల్​తో కలిసి తాము చేస్తున్న యుద్ధాన్ని ముగించాలని ఆలోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్​పై ఇప్పటికే పైచేయి సాధించామని అన్నారు. తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ఇరాన్ భీకర ప్రతిదాడులతో స్పందిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 

ఇటీవలే ఇరాన్​లోని కీలకమైన సౌత్​ పార్స్​ గ్యాస్ ఫీల్డ్​పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ అటాక్  జరిగిన కొన్ని గంటలకే ఇరాన్  కూడా ఖతార్​లోని అతిపెద్ద ఎల్ఎన్ జీ గ్యాస్ ఫీల్డ్​పై ప్రతిదాడి చేసింది. దీంతో అంతర్జాతీయంగా గ్యాస్, ఆయిల్  ధరలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగించే ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్  ప్రకటించారు. ఇరాన్​లోని గ్యాస్ ఫీల్డ్​పై ఇజ్రాయెల్  దాడులు చేయబోదని స్పష్టం చేశారు.

  • 46 వారాలు పడుతుంది: వైట్ హౌస్

తాము అనుకున్న లక్ష్యాలను సాధించి ఇరాన్​తో యుద్ధాన్ని ముగించేందుకు 46 వారాలు పడుతుందని వైట్ హౌస్  ప్రెస్ సెక్రటరీ కెరొలిన్ లీవిట్  ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ‘‘ఇరాన్ తో యుద్ధం ప్రారంభమై 3 వారాలు కావస్తున్నది. మా బలగాలు అద్భుతంగా పోరాడుతున్నాయి” అని లీవిట్ చెప్పారు.