హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్లో తాము నిల్వ ఉంచుకున్న 18.70 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్శివ్నందన్కుమార్కు ఇరిగేషన్ఈఎన్సీ (జనరల్) మురళీధర్శుక్రవారం లేఖ రాశారు. తమ రాష్ట్రంలో కృష్ణా నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 2022–23 వాటర్ఇయర్లో నాగార్జున సాగర్లో తమ వాటా18.70 టీఎంసీలను నిల్వ చేసుకున్నామని అందులో పేర్కొన్నారు.
ఏపీ తమ కోటాకు మించి నిరుడు 51.74 టీఎంసీలు అధికంగా వాడుకున్నదని, ఇప్పుడు సాగర్లో నిల్వ ఉన్న నీళ్లు తెలంగాణకు చెందినవేనని తెలిపారు. వర్షాకాలం ఆరంభంలో తాగు, సాగు నీటి అవసరాల కోసమే తాము ఏటా నీటిని నిల్వ ఉంచుతున్నామని గతంలోనూ బోర్డు దృష్టికి తీసుకువచ్చామన్నారు. నాగార్జునసాగర్లోకి ఈ వాటర్ఇయర్లో కొత్తగా ఇన్ఫ్లోస్ రాలేదని, ఈ పరిస్థితుల్లో తాము నిరుడు ఉపయోగించుకోకుండా నిల్వ చేసుకున్న నీటిని వాడుకునే హక్కు ఉంటుందని చెప్పారు.
సాగర్ కుడి కాలువ నుంచి తాగునీటి కోసం 5 టీఎంసీలు ఇవ్వాలంటూ ఏపీ ఇండెంట్సమర్పించిందని, కానీ బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ –2)కి 2009లో సమర్పించిన రిపోర్టు ప్రకారం కుడి కాలువ కింద తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలేనని పేర్కొన్నారు. దానికి విరుద్ధంగా తాగునీటికి 5 టీఎంసీలు కావాలని కోరుతోందన్నారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి సాగర్లో నిల్వ ఉంచుకున్న నీటిని వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.