- ప్రస్తుతం కాండ్యూట్ ద్వారా గ్రావిటీతో నీటి తరలింపు
దీనికి సమాంతరంగా కొత్త లైన్
హైదరాబాద్సిటీ, వెలుగు: నిజాం కాలంలో నిర్మించిన ఉస్మాన్సాగర్నుంచి మరింత ఎక్కువ నీటిని డ్రా చేయడానికి వాటర్బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
1920లో నిర్మించిన ఈ రిజర్వాయర్నుంచి 27 ఎంజీడీలను ఆసిఫ్నగర్ఫిల్డర్బెడ్స్వరకు తరలించడానికి అవకాశం ఉన్నా, కాండ్యూట్ (రాతి కాలువ) శిథిలావస్థకు చేరడం, లీకేజీలు పెరగడంతో 21 ఎంజీడీలే సరఫరా అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న సోర్స్నుంచే కొంత ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఉస్మాన్సాగర్ కాండ్యూట్కు సమాంతరంగా మరో 900 ఎంఎం పైప్లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు.
రూ. 282 కోట్లతో పైప్లైన్ నిర్మాణం
నిజాం కాలంలో 14.6 కి.మీ. పొడవున నిర్మించిన కాండ్యూట్ ద్వారా నీటిని ముందు ఆసిఫ్నగర్ఫిల్టర్ బెడ్స్కు తీసుకువచ్చి శుద్ధి చేసి తర్వాత నగరానికి అందిస్తారు. ఈ క్రమంలో లీకేజీలను తగ్గించడానికి, వృథాను అరికట్టడానికి కాండ్యూట్కు సమాంతరంగా పైప్లైన్ వేయాలని ప్రతిపాదనలు పంపడంతో సర్కారు ఓకే చెప్పింది. ఎన్సీపీఈ ఇన్ఫ్రాస్ర్టక్చర్ఇండియా అనే సంస్థ డీపీఆర్ను కూడా బోర్డుకు అందజేసింది.
మొత్తం ఆరు ప్రతిపాదనలు
డీపీఆర్లో వివరించిన దాని ప్రకారం కన్సల్టెన్సీ ఆరు ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఉస్మాన్సాగర్నుంచి ఆసిఫ్నగర్వరకు నిర్మించే పైప్లైన్తో పాటు మధ్యలో 0.5 మిలియన్ గ్యాలన్ల సంప్కమ్పంప్హౌస్ను నిర్మించాలని ప్రతిపాదించింది. అలాగే 1500 ఎంఎం గ్రావిటీ మెయిన్ పైప్లైన్ నిర్మాణం(800 మీటర్లు), 1300 ఎంఎం పంపింగ్మెయిన్(9.9 కి.మీ.)21 ఎంజీడీల వాటర్ ట్రీట్మెంట్ప్లాంట్, 1100 ఎంఎం పైప్లైన్(300 మీటర్లు), 1000 ఎంఎం గ్రావిటీ మెయిన్(5 కి.మీ.) నిర్మించాలని ప్రపోజల్స్సిద్ధం చేసింది.
ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ. 282 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఉస్మాన్సాగర్పొడవునా సమాంతరంగా పైప్లైన్ వేస్తే ఈ రిజర్వాయర్నుంచి నిరంతర నీటి సరఫరా సాధ్యమవుతుందని తెలిపింది.
