కామారెడ్డిటౌన్, వెలుగు : ఉద్యోగుల పెండింగ్ బిల్లులతో పాటు, రిటైర్డ్ఉద్యోగుల పెన్షన్, బెనిఫిన్స్ను రిలీజ్ చేయాలని యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ సత్యానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లాస్థాయి మీటింగ్లో ఆయన మాట్లాడారు. గతంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం డీఏ, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రిటైర్డ్ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా ప్రెసిడెంట్
ఆకుల బాబు మాట్లాడుతూ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. 20 ఏండ్ల పాటు టీచర్గా పని చేసిన వారికి టెట్ నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ సాయిలు, స్టేట్ కో ఆర్డినేటర్ ఎమీలియా, ప్రతినిధులు రూప్సింగ్, నారాయణ, బాలయ్య, సాయిగౌతమ్, నాపంల్లి, ఏసురత్నం, రాజ, రాజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
