
న్యూఢిల్లీ: మోడీ కేబినెట్లో ఉత్తరప్రదేశ్కే ఎక్కువ పదవులు దక్కాయి. ఆ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది మంత్రులయ్యారు. అటుతర్వాత సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. ఈ రాష్ట్రానికి ఎనిమిది మంత్రి పదవులు దక్కాయి. బీహార్కు ఆరు, మధ్యప్రదేశ్కు ఐదు, కర్నాటకకు 4, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మూడు చొప్పున పదవులు దక్కాయి. బెంగాల్కు అధిక ప్రాధాన్యం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ గత కేబినెట్లో మాదిరిగానే రెండు మంత్రి పదవులే దక్కాయి. ఒడిశా, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు రెండు చొప్పున.. అరుణాచల్ ప్రదేశ్, అసోం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, తెలంగాణకు ఒక్కో బెర్త్ దక్కింది.