
- రుద్రప్రయాగ్ జిల్లాలో ఘటన.. పైలట్, ప్రయాణికులు సేఫ్
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్లో ఓ హెలికాప్టర్కు పెను ప్రమాదం తప్పింది. శనివారం కేదార్నాథ్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో నేషనల్ హైవేపై ల్యాండయింది. నడిరోడ్డుపై హెలికాప్టర్ దిగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారు తీవ్రంగా దెబ్బతింది. ఉత్తరాఖండ్లోని బదాసు బేస్ నుంచి కేదార్నాథ్కు హెలికాప్టర్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ హెలికాప్టర్ను హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని చెప్పారు.
హెలికాప్టర్లో పైలట్తో పాటు ఐదుగురు భక్తులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. స్వల్ప గాయాలు కావడంతో పైలట్ను ఆస్పత్రికి తరలించామని వివరించారు. హెలికాప్టర్ను హైవేపైనుంచి తొలగించామన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఆన్సైట్ అసెస్మెంట్ కోసం ఒక దర్యాప్తు బృందాన్ని స్పాట్కు పంపించామని డీజీసీఏ వెల్లడించింది.