నడిరోడ్డుపై దిగిన హెలికాప్టర్ .. సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్

నడిరోడ్డుపై దిగిన హెలికాప్టర్ .. సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • రుద్రప్రయాగ్ జిల్లాలో ఘటన.. పైలట్​, ప్రయాణికులు సేఫ్

రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్​లో ఓ హెలికాప్టర్​కు పెను ప్రమాదం తప్పింది. శనివారం కేదార్​నాథ్​కు వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో నేషనల్ హైవేపై ల్యాండయింది. నడిరోడ్డుపై హెలికాప్టర్ దిగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారు తీవ్రంగా దెబ్బతింది. ఉత్తరాఖండ్​లోని బదాసు బేస్ నుంచి కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్​కు హెలికాప్టర్​ బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్​ హెలికాప్టర్​ను హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని చెప్పారు. 

హెలికాప్టర్​లో పైలట్​తో పాటు ఐదుగురు భక్తులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. స్వల్ప గాయాలు కావడంతో పైలట్​ను ఆస్పత్రికి తరలించామని వివరించారు. హెలికాప్టర్​ను హైవేపైనుంచి తొలగించామన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఆన్​సైట్ అసెస్​మెంట్ కోసం ఒక దర్యాప్తు బృందాన్ని స్పాట్​కు పంపించామని డీజీసీఏ వెల్లడించింది.