
చందుర్తి, వెలుగు: పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వీ6 వెలుగు డైరెక్టర్ జోగినపల్లి పృథ్వీరావు. చందుర్తి మండలం ముడపల్లి గ్రామానికి చెందిన ఆయన.. గ్రామంలో తన తల్లి సుచిత్ర స్మారకార్థం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకొచ్చారు.
ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన మెటీరియల్ను సమకూర్చారు. ఈ సందర్భంగా ఆయనకు. మాజీ సర్పంచి అంజి బాబు, ఉపసర్పంచ్ పుల్కం రవి, లీడర్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, ఏసుదాసు, శ్రీనివాస్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.