కరోనా టీకా కొరత కారణంగా రేపటి నుంచి మే 15 వరకు రెండవ డోస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మే 15 వరకు మొదటి డోస్ వ్యాక్సిన్ నిలిపివేయనుంది. మొత్తం 11 లక్షల మందికి రెండవ డోస్ వేయాల్సి ఉందని తెలిపింది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి రెండవ డోస్ వారికి వ్యాక్సిన్ దొరకడం లేదు. దీంతో ఆరోగ్య శాఖ ప్రస్తుతం ఉన్న డోస్ లను రెండవ డోస్ వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.