వాల్గో ఇన్‌ఫ్రాకు 5జీ ఆర్డర్​ 

వాల్గో ఇన్‌ఫ్రాకు 5జీ ఆర్డర్​ 

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​కు చెందిన వాల్గో టెలికం ఇన్​ఫ్రాం కర్ణాటక విధాన సౌదలో  5జీ నెట్‌వర్క్ మొబైల్ ఫోన్ సిగ్నల్ బూస్ట్ చేసే యాంటెన్నాలను ఏర్పాటు చేసింది. వీటిని కర్ణాటక గౌరవనీయ ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య,  శాసనసభ స్పీకర్ ఖాదర్‌ ప్రారంభించారు.

 కొత్తగా ఇన్‌స్టాల్ చేయబడిన యాంటెనాలు మొత్తం విధాన్ సౌద భవనం అంతటా 5జీ మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని ఇస్తాయి. కర్ణాటక శాసనసభకు ఈ సదుపాయం కల్పించినందుకు గర్వకారణంగా ఉందని వాల్గో సీఈఓ శ్రీధర్​ రావు అన్నారు. టెలికం ఇన్​ఫ్రా సొల్యూషన్స్​ అందించడంలో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని అన్నారు.