పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన షార్ట్ ఫిల్మ్ ‘వనజీవి రామయ్య’. బ్రహ్మాజీ, నాగరాణి, నాగమల్ల మహేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వేముగంటి దర్శకత్వం వహించగా, నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించారు.
ఈ బయోపిక్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఎంపికైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం ప్రెస్మీట్ నిర్వహించింది.
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్, తన్నేరు బాబురావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్రాన్ని అభినందించారు. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా టీమ్ తెలియజేసింది.
