
గ్రేటర్లో వన మహోత్సవం–2025 ప్రారంభమైంది. బుధవారం గాజుల రామారం సర్కిల్ షిర్డీహిల్స్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ మొక్కలు నాటారు. గతంలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్నగరం గ్రీన్ సిటీగా అవార్డు పొందినట్లు గుర్తు చేశారు. ఈసారి లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.