రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల స్వచ్ఛంధంగా గ్రామాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు కూడా కరోనా రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ లు పెట్టుకోని వారికి ఫైన్ లు వేస్తున్నారు. వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మాస్క్ పెట్టుకోకపోవడంతో రూ.1000 జరిమానా విధించారు వనపర్తి మున్సిపల్ కమిషనర్.
