వందేభారత్ ఎక్స్ ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆగస్టు 09వ తేదీ బుధవారం తిరుపతి నుండి సికింద్రాబాద్కు వస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్స్ రైల్లో పొగలు రావడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా మునుబోలు దగ్గర మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ట్రైన్ బాత్ రూమ్లో సిగరెట్ తాగాడు. ఆ తర్వాత అక్కడే పడేయడంతో రైళ్లో పొగలు వ్యాపించాయి.
రన్నింగ్ ట్రైన్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఆ తర్వాత కొందరు ప్రయాణికులు చైన్ లాగారు. ట్రైన్ ఆగిన వెంటనే ప్రయాణికులంతా భయంతో కిందకు దిగి పరుగులు తీశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రైలు నుండి దూకి పారిపోతుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనతో అరగంటకు పైగా రైలు ఆగిపోయింది. ఆ తర్వాత పొగలు తగ్గడంతో మళ్లీ ట్రైన్ వెళ్లిపోయింది.
#Breaking: Tragedy averted in #VandeBharatExpress from #Tirupati-#Hyderabad. Fumes emerged from a bogey after an idiot smoked a cigarette in toilet. Plastic caught fire & smoke spread. Train was stopped at Manubolu Rly Stn. Accused arrested who was travelling without a ticket! pic.twitter.com/l4lkdb7bdc
— Krishnamurthy (@krishna0302) August 9, 2023