అల్లు రామలింగయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

అల్లు రామలింగయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

సినిమాలో హీరో, హీరోయిన్లు ఎంత ముఖ్యమో హాస్యనటులూ అంతే ముఖ్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో అల్లు రామలింగయ్య బుక్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య పుస్తకాన్ని ఆవిష్కరించడం తన మనసుకు సంతోషాన్నిచ్చిందన్నారు. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. జనాల్లో సినిమాపై ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గట్లేదన్నారు. ఈ ప్రపంచంలో చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని.. సినిమా జనాల్లో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తుందన్నారు. సినిమాల్లో విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి, పద్ధతులు ఉండాలని సూచించారు. 

హాస్యం చాలా ఖరీదైనదని వెంకయ్యనాయుడు తెలిపారు. హాస్యాన్ని పండించడం అంత ఈజీ కాదని..కొంచెం అటు ఇటు అయితే చాలా కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. నా చిన్నతనంలో నాటకాలు చూసేవాన్ని.. ఇప్పుడవి కనిపించట్లేదు అని గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య సినిమాల్లో తిట్టుకోవడం, కొట్టుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా అనేది రియాల్టీకి దగ్గరగా ఉండాలన్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయ్యాలని సూచించారు. ఇవన్నీ అల్లు రామలింగయ్య చేశారని.. స్వతంత్ర సమరంలోనూ పాల్గొన్న వ్యక్తి ఆయన అని తెలిపారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కళామ తల్లికి రెండు నేత్రాలైతే.. చిరంజీవి మూడో నేత్రం అని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబసభ్యులు (అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్).. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హాస్య నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరామ్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, పృథ్వీ రాజ్, అలీ, సునీల్, వెన్నెల కిషోర్ లను అల్లు అర్జున్ సన్మానించారు.