
రేవల్లి, వెలుగు: రేవల్లి మండలం ఏర్పడి పదేళ్లయినా పలు ప్రభుత్వ ఆఫీసులకు సొంత స్థలాలు లేక అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. గమనించిన మండల కేంద్రానికి చెందిన వంటిపిరా శాంతమ్మ , దానయ్య కొంకలపల్లి రేవల్లి మధ్యలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న తన ఎకరా పొలంలో నుంచి 20 గుంటల స్థలాన్ని తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల కోసం కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. శాంతమ్మ అధికారులకు సొంత జాగా ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ వాడల పర్వతాలు, తహసీల్దార్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శాంతవ్వను శాలువాతో సన్మానించారు.