టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో జూన్ 9 న హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. మెగా సోదరుడు నాగ బాబు(Nagababu) ఇంట్లో ఈ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది.
వరుణ్,లావణ్యల వివాహం నవంబర్ 1న ఇటలీ-టస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్(Borgo San Felice Resort)లో చేసుకోనున్నారు. ఇది ఒక చారిత్రాత్మక గ్రామంగా పేరొంది. ఆ తర్వాత రిసార్ట్గా మారింది. ఈ గ్రామంలో సినీ సెలబ్రిటీల పెళ్లిల్లు జరగడంతో ఈ ప్లేస్ హాట్ టాపిక్ గా మారింది.
లేటెస్ట్ గా ఇటలీ(Italy) టుస్కానీ( Tuscany)కి చేరుకున్నట్లు వరుణ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ షేర్ లో ఓ ఫోటో పోస్ట్ చేశారు. విమానం కిటికీ నుండి చూస్తున్న ఫోటో షేర్ చేయడంతో..హ్యాపీ జర్నీ బ్రో..అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వరుణ్ లావణ్యల పెళ్లి కోసం ఉపాసన కామినేని కూడా టుస్కానీ చేరుకున్నారు. ఆమె డబుల్ రెయిన్బో ఫోటోను షేర్ చేస్తూ.. ఆన్ లొకేషన్ టస్కానీ, ఇటలీ అని ట్యాగ్ చేసింది.
ఈ వివాహ వేడుకలు వరుసగా..హల్దీ, మెహందీ, సంగీత్ తో స్టార్ట్ అయి..నాలుగు రోజుల పాటు ఈవెంట్ కళకళలాడబోతుంది. ఆ తర్వాత నవంబర్ 1న వివాహంతో పూర్తవుతుంది. అనంతరం గ్రాండ్ పార్టీ ఉంటుందని సమాచారం.
ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కామినేని, పవన్ కళ్యాణ్, నాగబాబు ఆయన కుటుంబం, అల్లు అర్జున్, అల్లు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మరి కొంతమంది ప్రముఖులు హాజరుకానున్నారు.