స్కందగిరిలో వేద విద్వాన సభలు షురూ..శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా ప్రారంభం

స్కందగిరిలో వేద విద్వాన సభలు షురూ..శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా ప్రారంభం

పద్మారావునగర్, వెలుగు: శ్రీజనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్  రజతోత్సవ వేడుకల సందర్భంగా 25వ తెలంగాణ వేద విద్వాన మహాసభలు బుధవారం స్కందగిరి శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్కందగిరి ఆలయ చైర్మన్, రిటైర్డ్​ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మాణ్యం దంపతులు మహాసభలను ప్రారంభించారు. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీస్వామి వేదాల విశిష్టతను వివరించారు. శ్రీజనార్థన ఆనంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్​ తూములూరి సాయినాథ శర్మ, ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద శర్మ, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మహాసభలు ఈ నెల 12 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.