విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం పెంపొందించాలి : కేయూ రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం

విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం పెంపొందించాలి : కేయూ రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం
  • వర్సిటీలో ‘ వీర్ బాల్ దివస్’ పోస్టర్ ఆవిష్కరణ

హసన్ పర్తి, వెలుగు:  కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ వేడుకలను విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం, జాతీయతాభావం వంటి విలువలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం పేర్కొన్నారు.  సోమవారం వర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాలు సంయుక్తంగా 2026, జనవరి3న నిర్వహించనున్న “వీర్ బాల్ దివస్” ప్రోగ్రామ్ పోస్టర్‌‌ను అవిష్కరించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్’  ఆదేశాల మేరకు దేశం కోసం, ధర్మం కోసం కేవలం 7 ఏండ్ల వయసులో ప్రాణాలను త్యాగం చేసిన జోరావర్ సింగ్ , ఫతే సింగ్ స్మారకార్థం “వీర్ బాల్ దివస్” ను జనవరి 3న కేయూ సెనేట్ హాల్‌‌లో నిర్వహిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు “వీర్ బాల్ దివస్  జాతి నిర్మాణానికి స్ఫూర్తి"  అంశంపై వ్యాసరచన పోటీలు , వక్తృత్వ పోటీలు నిర్వహిస్తుమన్నారు.  

వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు, రిజిస్ట్రేషన్ కోసం జనవరి 2 చివరి తేదీగా నిర్ణయించామన్నారు.  రిజిస్ట్రేషన్ కోసం  వర్సిటీ వెబ్‌‌సైట్‌‌ను సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్అఫైర్స్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, కేయూ కాలేజీ ప్రిన్సిపాల్ తాళ్ళపల్లి మనోహర్, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాధిపతి ఎం. స్వర్ణలత, ప్రొ కె. సుభాశ్, డా. కె. ప్రసన్న, ఎస్. సాహితీ, ఎం. జాస్మిన్, బి. రజిత పాల్గొన్నారు.