పుష్పను దాటేసిన వీరసింహారెడ్డి

పుష్పను దాటేసిన వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ చూసేందుకు అభిమానులు థియేటర్లకి క్యూ కడుతున్నారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. సినిమా విడుదలైన మొదటిరోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.25.36 కోట్లు వచ్చాయి. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన 15వ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది.

ఇప్పటివరకు ఈ రికార్డ్ పుష్ప సినిమాపై ఉంది. పుష్ప మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజులో రూ.24.90కోట్లు రాబట్టగా, ఆ రికార్డ్ ను వీరసింహారెడ్డి తిరగరాసింది. రూ.25.36 కోట్లు వసూలు చేసింది. వసూళ్లపరంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా మొదటిస్థానంలో ఉంది. రూ.74.11 కోట్ల వసూళ్లతో ఆ సినిమా ఫస్ట్ ప్లేస్ లో, కేజీఎఫ్ రెండో స్థానంలో నిలిచింది.