దుమ్ములేపుతున్న 'వీరసింహారెడ్డి' ఓటీటీ ట్రైలర్

దుమ్ములేపుతున్న 'వీరసింహారెడ్డి' ఓటీటీ ట్రైలర్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వీరసింహా రెడ్డి'. సంక్రాంతి రోజున విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. వీరసింహా రెడ్డి ఓటీటీ హక్కులను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా వదిలారు. 

ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్స్ గా నటించారు. వరలక్ష్మి శరత్, దునియా విజయ్, కీలక పాత్రలను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. కథాకథనం, పాటల,డాన్సులు, డైలాగ్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులును ఎంతో ఆకట్టుకుంది. ఇక ఫైట్స్ విషయానికొస్తే.. బాలయ్య ఇరగదీశాడని చెప్పాలి.